నిన్న మొన్నటి వరకు వివిధ సమస్యలతో అల్లాడిన వైసీపీలో ఇప్పుడు వెలుగు రేఖలు ప్రసర్తిస్తున్నాయి. జగన్ వ్యూహా త్మక ఎత్తుగడలతో రాష్ట్రంలో రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిం చేం దుకు వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలకు దెబ్బ కొట్టేలా ఆయన ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఏళ్లతరబడి పార్టీని పట్టించుకుని, సమన్వయకర్తలుగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తడబడతారని అనుమానం వచ్చినా వారిని వెంటనే మారుస్తున్నారు. ఈ విషయంలో జగన్ ఎలాంటి సందేహాలకు తావివ్వడం లేదు. తాను చెప్పిన మాటలను వింటారని, నాయకులు తన మాటలను జవదాటరని ఆయన విశ్వసిస్తున్నారు.
ప్రధానంగా రాజధాని జిల్లా గుంటూరులో వైసీపీ అధినేత చూపిన చొరవ. మార్చిన సీట్లు బహుశ సీనియర్ అధినాయ కులు కూడా ఇలాంటి సాహసాలు చేయలేరు. ప్రదానంగా వైఎస్ ఫ్యామిలీని అంటిపెట్టుకుని, వైఎస్ ఫ్యామిలీతో ఉన్న నాయకులను కూడా జగన్ సమన్వయ కర్తల పదవుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో కొద్దిగా వ్యతిరేకత వచ్చినా.. కూడా సర్దుకుంటుందనే జగన్ ధీమా ఇప్పుడు నిజమైంది. ఇక, తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోనూ ఇదే తరహ పరిస్థితి కనిపించింది. ఇక్కడ వైఎస్ ప్యామిలీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ఉన్నారు. నిజానికి ఈయనకు చిలకలూరిపేట నియోజకవర్గం కొట్టిన పిండి. గత ఎన్నికల్లోఈయన ప్రత్తిపాటి పుల్లారావు పై ఓటమి పాలయ్యారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఈయన గెలుపు అవకాశాలు కొంత తడబాటుకు గురవుతున్నాయని తెలియడంతో జగన్ వెం టనే ఈయన స్థానంలో ఎన్నారై మహిళ విడదల రజనీ నిరంగంలోకి దింపారు. తనను కాదని వేరే మహిళకు అవకాశం ఇవ్వడంతో అలకబూనిన మర్రి, ఆయన అనుచరులు కూడా కొంతకాలంగా అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. అయితే, ఎన్నికలకు వేళ మించుతున్న నేపథ్యంలో జగన్ మర్రి సేవలను వాడుకోవాలని భావించారు.ఈ క్రమంలోనే ఆయన మర్రికి వర్తమానం పంపారు. మంత్రి పదవిని ఆఫర్ చేశారు. దీంతో మర్రి వర్గం దిగి వచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సమన్వయకర్త విడదల రజనీకి సహకరించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే.. ప్రత్తిపాడు కోటకు బీటలు పడడమే కాకుండా బద్దలై పోతుందని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.