ట్రైన్ యాత్రలో చింతమనేనికి మరోసారి డోస్ ఇచ్చిన పవన్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడ నుండి తుని వరకు రైలులో ప్రయాణించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు యాత్ర లో జనసేన పార్టీ కార్యకర్తలతో మరియు అభిమానులతో మమేకమై ముందుకు సాగడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ మరొకసారి స్పందించారు.


గతంలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ ...జిల్లా పర్యటన మొత్తం చింతమనేని పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప్రజా పోరాట యాత్ర కొనసాగించారు. అయితే తాజాగా రైలు యాత్రలో పాల్గొన్న పవన్ దృష్టికి ఇటీవల విజిలెన్స్ అధికారుల పై మీడియా ప్రతినిధులపై చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరుపై ట్రైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకొచ్చారు.


దీంతో పవన్ కళ్యాణ్ ఈ విషయం తన దృష్టికి వచ్చిందని  వచ్చిందని తన రైలు యాత్రలో విలేఖరులకు తెలిపారు.అతన్ని తన ప్రవర్తన తీరు మార్చుకోవాలని అప్పుడే హెచ్చరించినా అతను మార్చుకోకపోగా అతన్ని ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా మిత్రులు మీద దాడి చేసి బూతులు కూడా మాట్లాడినట్టు తనకి తెలిసిందని తెలిపారు...


మరియు ఇంతటి దారుణమైన వ్యక్తిత్వం కలిగిన వారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని రైలులో ఉన్న విలేకర్లకు తెలియజేసినట్టు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: