యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానానికి ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద కుప్పకూలింది. పైలట్ ప్యారాచూట్ సాయంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగాడు. స్వల్ప గాయాలైన అతడికి.. మరో హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆర్మీ వైద్యులు చికిత్స అందించారు. అనంతరం అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన యోగేశ్ ఆ శిక్షణ విమానానికి పైలట్గా ఉన్నారు. హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరి.. బాహుపేట దగ్గరకు రాగానే కుప్పకూలింది.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కాలి బూడిద అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చాపర్ మొత్తం మంటల్లో కాలిపోయింది.