దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికలలో కుకట్ పల్లి నియోజకవర్గం నుండి మహా కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.
ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యురాలు గనుక చాలామంది నందమూరి సుహాసిని పై ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు..సినిమా ఇండస్ట్రీలో చాలామంది నందమూరి చూసిన కి మద్దతు తెలిపారు. అంతేకాకుండా మరికొంతమంది నందమూరి సుహాసిని కి మద్దతుగా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లు ప్రచారం చేస్తారా లేదనే విషయం పై స్పష్టత రాలేదు. అయితే తాజాగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సుహాసిని కోసం ప్రచారానికి వస్తారంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. తాజాగా సుహాసినికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తాను ప్రచారంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అంవుతోంది.
మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ...తాజాగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. మరోపక్క మహాకూటమిలో రాజకీయ పార్టీలు మరియు తెలంగాణలో ఉన్న వివిధ పార్టీలు తమ ప్రచార పర్వంలో తమ తమ నియోజకవర్గాలలో అభ్యర్థులు దూసుకెళ్ళిపోతు ప్రచారం చేసుకుంటూ సాగిపోతున్నారు.