మారాష్ట్రాల్లోని నేరగాళ్ళపై దాడి జరిగితే ఊరుకోం?: ముఖ్యమంత్రులు మమత, చంద్రబాబుల తీరు
కోల్కతాలో జరుగుతున్న పరిణామాలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడుల్ని ఆయన తప్పు పట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అండగా నిలుస్తామన్నారు. కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాల ఐక్యతను చూసి ప్రధాని మోదీకి నైరాశ్యం వచ్చిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు.వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు మోదీ-అమిత్ షా ద్వయం కంకణం కట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ వ్యతిరేకులను టార్గెట్ చేయడం ఆందోళనకరమన్నారు. కోల్కతాలో జరుగుతున్న పరిణామాలు మోడీ-షా ల వ్యవస్థల భ్రష్ఠు పట్టిస్తున్నారు అనడానికి ఉదాహరణ అన్నారు చంద్రబాబు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. రాష్ట్రాలను భయపెట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు సన్నగిల్లడం వల్లే బీజేపీ ఇటువంటి పనులకు దిగజారుతోందని ఆరోపించారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా అశాంతి సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
dharma
-
Kolkata
-
Calcutta
-
Traffic police
-
central government
-
Manam
-
C M Ramesh
-
Chief Minister
-
CBN
-
choudary actor
-
Mamata Benerjee
-
Narendra
-
West Bengal - Kolkata
-
Mamta Mohandas
-
Bharatiya Janata Party
-
Prime Minister
-
Amit Shah
-
court
-
sunday
-
CBI
-
police
-
benarjee
-
Sambandam
-
monday
-
Andhra Pradesh
-
Parliment
-
Loksabha