ఆర్యవైశ్యులకు సంచలన ప్రకటన చేసిన టిడిపి ప్రభుత్వం…!
మరియు అదే విధంగా పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్ లో అందుబాటులో ఉంటూ ఎన్నికల వ్యూహాలను దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆర్యవైశ్యులకు ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని మంత్రి నారాయణ అన్నారు.
నెల్లూరులో తెదేపా ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ పాలకమండలిని ప్రభుత్వం నియమించిందన్నారు. దీంతో టీడీపీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.