డిఫెన్సులో పడ్డ చంద్రబాబు.. ఇక జగన్ ఆడుకుంటాడా..?

Chakravarthi Kalyan

జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో ఉండటం ఇన్నాళ్లూ టీడీపీ నేతలు ఆరోపణలు చేసేందుకు ఆస్కారం కల్పించింది. కానీ ఇప్పుడు మంగళగిరిలో కొత్త నివాసంలోకి వచ్చారు. దీంతో ఇక ఆ ఆస్కారమే ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు.



చంద్రబాబు ఏపీ విభజన తరవాత ఏడాదికి విజయవాడకు మకాం మార్చారు. కానీ ఆయన ఉంటున్నది అక్రమ కట్టడమన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు జగన్ అన్నీ సక్రమంగా ఉంటున్న ఇంట్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు కరెక్ట్.. అలాగే ఇంకో విషయం కూడా ఉంది.



చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే జగన్ మాత్రం ఏపీలో లో నిర్మించుకున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల్లో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, అప్పుడు చంద్రబాబు ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోతారని కామెంట్ చేస్తున్నారు.



వైసిపి వస్తే రాజదాని వెళ్లిపోతుందని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు వాళ్ల నోటికి మూత పడుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంటి విషయంలో జగన్ ఫైరింగ్ మొదలుపెడతాడేమో.. మరి చంద్రబాబు ఏం చెబుతారో..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: