ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి వాళ్ళనే కాటయబోతోంది !!

KSK

సపోర్ట్ గా ఉన్నంత కాలం సంకనెక్కి ఆ తరవాత సపోర్ట్ చెయ్యకపోతే  కాళ్ళ కింద ఉండాలి అనుకోవడం చంద్రబాబు లాంటి వ్యక్తులకి అత్యంత అలవాటు ఐన అంశం అని ఎంతోమంది ఆరోపిస్తూ ఉంటారు. పొలిటికల్ గా చంద్రబాబు చరిత్ర చూసుకుంటే ఈ దేశం లోనే వరస్ట్ పొలిటీషియన్ అనే మాటలు మనకి అనేకసార్లు వినపడ్డాయి.

రీసెంట్ గా టీడీపీ కి రాజీనామా చేసి వైకాపా లోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యే ల మీద కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగిపోయాయి అనే మాట వినిపిస్తోంది. రాజకీయం చెయ్యడం తప్పు కాదు కానీ నిన్న ఆహ ఓహో అన్న అంశాలు ఇవాళ తప్పులుగా వాళ్ళ కళ్ళకి కనపడ్డం చాలా మూర్ఖమైన చర్యగా చెప్పాలి .

చంద్రబాబు కీ ఆయన పార్టీ కీ డబ్బా కొట్టుకునే కొన్ని వెబ్ సైట్ లు ఆ మధ్య చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి గవర్నమెంట్ స్కూల్ పెడితే దాని గురించి నిజాయతీ కథనాలు రాసింది. ఆ స్కూల్ యొక్క కష్టం లో ఎవరు ఎంత కష్టపడ్డారు అనేది చీరాల నియోజికవర్గం మొత్తం లో ఎక్కడ అడిగినా చెబుతారు.

కలక్టర్ సహాయం తో మరికొందరు పెద్దల సహాయం తో ప్రజలకి అత్యంత తేలికైన , నాణ్యమైన బోధనా విధానం ఉండాలి అని .. పిల్లల చదువులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు కి ముఖ్యం అన్న రీతి లో ఆ నిర్మాణం సాగింది. స్వయంగా చంద్రబాబు తనయుడే వెళ్లి స్కూల్ కూడా ఓపెన్ చేసి ఆహా ఓహో అన్నారు కూడా .. ఇంత మంచి హానెస్ట్ నిర్మాణం ఎక్కడా లేదు అన్నట్టుగా లోకేష్ మాటలు కూడా ఉన్నాయి. అలాంటి స్కూల్ కి సంబంధించి రీసెంట్ గా టీడీపీ అనుకూల వెబ్ సైట్ లో స్కాం జరిగిపోయింది అంటూ ఏడవడం చూస్తుంటే టీడీపీ యొక్క చేతకాని తనానికి ప్రతీక గా చెబుతున్నారు.

మనుషులని వాడుకుని వదిలేయడం లో చంద్రబాబు ది సేపెరేట్ స్టైల్ అనీ దానికి ఎవ్వరూ పోటీ కూడా ఇవ్వలేరు అనే మాట వినిపిస్తోంది. టీడీపీ లోకి వచ్చే వారకూ ఆమంచి కాళ్ళూ గడ్డం పట్టుకున్నారు ఇప్పుడు అనేక కారణాల వలన పార్టీ లోంచి బయటకి వస్తే ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. అర్ధం పర్ధం లేని నిందలు , రుజువులు లేని ఆరోపణల తో రెచ్చిపోతున్న కొందరు వెబ్ సైట్ దారుల మీద కేసులకి కూడా వైకాపా ప్లాన్ చేస్తోంది.

కేవలం స్కూల్ అంశం అనే కాదు ఇంకా చాలా రకాలుగా కక్ష సాధింపు జరుగుతోంది. మార్ఫింగ్ ఫోటోలతో , మూర్ఖపు రాతలతో .. జరగని సర్వే లు జరిగినట్టు చెబుతూ రాసుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు కొందరు. కరక్ట్ గా గెలిచే క్యాండిడేట్ ని కూడా పెట్టుకోలేక " ఆమంచి ఓటమి " అంటూ శాడిజం మొత్తం సోషల్ మీడియా లో చూపిస్తోంది టీడీపీ పార్టీ అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

ఆమంచి మీద కక్కుతున్న విషం తిరిగి తమమీదే పడుతుంది అనీ చీరాల లో టీడీపీ కి డిపాజిట్ కూడా రాదు అని వారికి తెలిసి కూడా ఇలా చెయ్యడం శోచనీయం అంటున్నారు లోకల్ జనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: