వైసీపీలో కొందరు సీనియర్లకు దక్కని సీట్లు..!

KSK
గత సార్వత్రిక ఎన్నికల్లో కొద్దిపాటి ఓటింగ్ తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు పగడ్బందీగా పక్కా వ్యూహా లతో ముందుకు దూసుకుపోతున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ క్రమంలో ఇటీవల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జగన్ ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లు దాదాపు 40% యంగ్ లీడర్ లకు జగన్ అవకాశం ఇవ్వడంతో పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లకు సీట్లు దక్కలేదు.


ముఖ్యంగా జగన్ బాబాయి వై వి సుబ్బారెడ్డి కి ఒంగోలు టికెట్ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా ఛానల్ లు ఈ ఎపిసోడ్ ని వైసిపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న క్రమంలో ఇటీవల స్పందించిన వై వి సుబ్బారెడ్డి ఎల్లో మీడియా చానల్స్ చేస్తున్న వార్తలను ఖండించారు.


వై వి సుబ్బారెడ్డి దారిలోనే దాడి వీరభద్ర రావుకు, కిల్లి కృపారాణికి, టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన బుట్టా రేణుక కు...ఇదే విధంగా జగన్ టికెట్లు కేటాయించకుండా ఉండటంతో వైసీపీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఎల్లో మీడియా చానల్స్ తెగ ఊదరగొడుతున్నాయి. అయితే మరోపక్క జగన్ మాత్రం రాబోతున్న ఎన్నికలలో ఎలాగైనా గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఖచ్చితమైన నిర్ణయాలతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: