దేశంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా నశించి పోతుందన్నదానికి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన పిల్లలను ప్రియుడి మోజులో పడి దారుణంగా హింసించడం, చంపడం..భర్తను కడ తేర్చిన సంఘటనలు..ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను దారుణంగా చంపివేసిన సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.
తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త, కన్న కొడుకును దారుణంగా చంపిన సంఘటన కలకలం రేపింది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తాజ్పురా మందవేలికి చెందిన రాజా(25) రెండేళ్ల క్రితం దీపికను పెళ్లాడాడు. వీరికి ఏడాది వయసున్న ప్రినీష్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే తన భర్త కనిపించుట లేదని పోలీసుల కు ఫిర్యాదు చేసింది దీపిక. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బయటకు వెళ్లే సమయంలో అతడు సెల్ ఫోన్ తీసుకు వెళ్తాడు కదా..అది ఇవ్వమని అడిగారు. దాంత తన భర్త బయటకు వెళ్లే సమయంలో ఫోన్ తీసుకు వెళ్లలేదని..ఇంట్లో ఎక్కడో ఉందని బుకాయించింది.
ఆమె మాట్లాడుతున్న విధానం చూసి పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో అడగడంతో అసలు నిజం వెల్లడించింది. రాజా స్నేహితుడితో దీపికకు వివాహేతర సంబంధం ఉందని, వీరి హత్యకు అదే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీపికతో సంబంధం పెట్టుకున్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.