ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. వైసీపీ జోరు ముందు టీడీపీ ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. 9.15 నిమిషాలకు ట్రెండ్స్ పరిశీలిస్తే అన్ని జిల్లాల్లోనూ వైసీపీ దూసుకుపోతోంది. చివరకు టీడీపీ పటిష్టంగా ఉంటుందని భావించిన గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో ఉంది. వైసీపీ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే టీడీపీ కేవలం 10 స్థానాల్లోనూ జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రమే ఆధిక్యంలో ఉంది.