కలకాలం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్తే కాల యముడయ్యాడు. అనుమానం పెనుభూతమై ఇంతటి దారుణానికి ఒడిగట్టేలా చేసింది. 8 ఏళ్లుగా దూరంగా ఉన్నా.. అనుమానం మాత్రం పోలేదు. అదును కోసం వేచి చూసి హత్య చేశాడు ఓ భర్త..
ఈ దారుణ సంఘటన వరంగల్ జిల్లా కట్రియాల గ్రామానికి చెందిన యాదగిరి మల్లికాంబ దంపతుల మధ్య జరిగిన తంతు. ఇలా 23 మూడు ఏళ్లు కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిత్యం ఇలా గొడవలవుతుండటంతో మల్లికాంబ ఎనిమిది ఏళ్ల క్రితం పుట్టింటింకి వెళ్లిపోయింది.
ఇక పిల్లలు పెద్ద అవుతుండటంతో ఎలాగైనా దంపతుల మధ్య రాజీ కుదిర్చాలని పెద్దలు భావించారు. అనుకున్నట్లుగానే మాట్లాడారు. భర్త యాదగిరి కూడా సరే అని ఒప్పుకున్నాడు. మంచిగానే చూసకుంటానని మాయ మాటలు చెప్పాడు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు.
ఆ టైమ్లో యాదగిరి మనసులో ఆలోచనలన్నీ వేరే ఉన్నాయి. ఇక చాలా కాలంగా కరెస్ట్ టైమ్ కోసం ఎదురు చూస్తున్న మల్లికాంబ భర్త.. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తెల్లవారుజామున నిద్రపోతున్న భార్యపై గొడ్డలితో అతి కిరాతకంగా మెడైపై నరికి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.