ఏపి సీఎం జగన్..మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ లో నేటి ఉదయం సచివాలయం లోకి అడుగు పెట్టిన ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..తన మంత్రి వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించబోతున్నారన్న విషయం పై రక రకాలుగా చర్చలు జరిగాయి.
మొత్తానికి మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో క్లారిటీ వచ్చేసింది. ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. మంత్రుల శాఖలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు భవనాలు
2.బొత్స సత్యనారాయణ- మున్సిపల్
3.పుష్ఫశ్రీవాణి - గిరిజన సంక్షేమ శాఖ
4.ఆవంతి శ్రీనివాస్-పర్యాటక
5.పిల్లి సుభాష్ చంద్రబోస్- రెవెన్యూ
6.శ్రీరంగనాథరాజు-గృహనిర్మాణ
7.తానేటీ వనిత- మహిళా శిశు సంక్షేమ
8. కొడాలి నాని-పౌరసరఫరాల
9. పేర్నినాని- రవాణా, సమాచార శాఖ
10. వెల్లంపల్లి శ్రీనివాస్-దేవాదాయ ధర్మదాయ
11.మేకతోటి సుచరిత- హోంశాఖ
12.మోపిదేవి వెంకటరమణ- పశుసంవర్థక, మత్స్యశాఖ
13.బాలినేని శ్రీనివాస్ రెడ్డి- అటవీ, పర్యావరణం
14. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పంచాయితీరాజ్& రూరల్ డవలప్ మెంట్
15.ఆదిమూలం సురేష్- విద్యాశాఖ
16.అనిల్ కుమార్- ఇరిగేషన్
17.మేకపాటి గౌతంరెడ్డి-పరిశ్రమలు, వాణిజ్య
18.కె. నారాయణస్వామి- ఎక్సైజ్ కమర్షియల్
19.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక
20.గుమ్మనూరు జయరామ్- కార్మిక, ఉపాధి
21.అంజద్ భాషా- మైనార్టీ సంక్షేమ
22.ఎం. సూర్యనారాయణ- బీసీ సంక్షేమ శాఖ
23. పినిపె విశ్వరూప్- సాంఘీక సంక్షేమ సంక్షేమశాఖ
24.ఆళ్లనాని- వైద్య ఆరోగ్యం
25.కన్నబాబు- వ్యవసాయం