తల ఎక్కడ పెట్టుకుంటావు బాబు...జగన్ వస్తే పెట్టుబడులు రావన్నావు...ఇదిగో...2500 కోట్లు
చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనను చీ కొట్టిన ప్రజలు రికార్డు స్థాయి మెజార్టీతో జగన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా సీఎం పీఠంపై కూర్చున్నది మొదలు..జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ- అభివృద్ధి రాష్ట్రంగా ఏపీని అయితే అవన్నీ పటాపంచలు చేస్తూ రాష్ట్రంలోకి పెట్టుబడుల పర్వం మొదలైంది. ఐదు దేశాల్లో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల్లో ఒకటైన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల భూమిని ఇప్పటికే కంపెనీ కొనుగోలు చేసింది. అంతకుముందు ఉన్న బిల్డింగ్లు, లేదా మరే ఇతర రకమైన సదుపాయాలను వాడుకోకుండా పునాదుల నుంచి కొత్తగా ఈ ప్రాజెక్టును అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ రూపొందించనుంది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక ప్లాంటు మొదలైపోయినట్లే.