రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు దుర్మరణం

SEEKOTI TRIMURTHULU
శ్రీకాకుళం జిల్లా మందస మండలం మధనాపురం పెట్రోల్  బంకు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో పలాస వ్యవసాయ శాఖ సంచాలకులు చల్లా దశరథుడు ( 50) దుర్మరణం పాలయ్యారు.  కారులో వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దశరధుడు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


పలాస వ్యవసాయ శాఖ సంచాలనకులుగా చెస్తున్న దశరధుడు అధికారిక పనుల నిమిత్తం కారులో పలాసకు వెళ్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు కారులో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా మధనాపురం సమీపానికి చేరుతుండగా పెట్రోల్‌ బంకు వద్ద నిలిపిఉన్న లారీని బలంగా ఢీకొనడంతో దశరధుడు తీవ్రగాయలపాలయ్యాడు.

స్థానికులు సమీప హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు స్థానిక వైద్యులు నిర్ధారించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలింపు. ఈ సంఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: