టీడీపీ.. ఇది మరీ అతికదా?
తాజాగా ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి మాట్లాడుతూ.. 'అక్రమాస్తుల కేసులో బెయిల్ కోసం రాంజెఠ్మలానీ, ముకుల్ రోహత్గి, సుశీల్కు మార్ వంటి న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి న్యాయవాదులుగా పెట్టుకున్నావు. ఒక్కో న్యాయవాదికి రోజుకు రూ.కోటి చెల్లించావు. ఇక బెయిల్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావో చెప్పాలి...' అని వ్యాఖ్యానించాడు. జగన్ బెయిలును కూడా కొనుక్కొన్నాడని తెలుగుదేశం నేత ఆరోపించడం విశేషం.
ఇదతా ఇలా ఉంటే.. జగన్ విడుదల సమయంలో ఆయన ఫ్యాన్స్ కాల్చిన టపాసులను కూడా తెలుగుదేశం వాళ్లు ప్రస్తావించడం విశేషం. జగన్ బెయిల్ పై విడుదల సమయంలో జరిగిన హంగామాను కూడా తెలుగుదేశం వాళ్లు విమర్శించారు. జగన్ అనుచరులు ప్రతీ సెగ్మెంట్లో రూ.5 లక్షల విలువైన టపాసులు తగలబెట్టారు. అని తెలుగుదేశం ఆరోపించడం విశేషం. అయితే టపాసుల గురించి కూడా లెక్కలు చెప్పడం మరీ అతిగా లేదూ?