అయోధ్యలో శ్రీరాముని వారసులు ఉన్నారా?
ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే చాలా సమయం పట్టేలా ఉన్నది. సుప్రీం కోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణ జరపాలని నిర్ణయించింది. దీనిపై ఇరుపక్షాల వాళ్ళను వివిద రకాల ప్రశ్నలు వేస్తున్నది. తాజాగా సుప్రీం ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్న రామ్ జన్మభూమి తరపున వాదిస్తున్న లాయర్ ను ఇరకాటంలో పెట్టింది. అయోధ్యలో శ్రీరాముని వారసులు ఇప్పటికి ఉన్నారా.. ఉంటె వాళ్లెవరో తెలుసుకోవాలని ఉందని సుప్రీం కోర్టు అడిగింది.
ఈ ప్రశ్నకు పాపం ఆ లాయర్ ఎలాంటి జవాబు చెప్పాలో అర్ధంకాలేదు. హిందువులు దేవుళ్లను ఒక స్పష్టమైన ఆకారంతో పూజించరని, అవతారపురుషులుగానే పూజిస్తారని లాయర్ పరాశరణ్ పేర్కొన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని పెట్టక ముందునుంచే, ఆలయాన్ని నిర్మించకముందునుంచే హిందువులు శ్రీరాముడిని అక్కడ ఆరాధిస్తూ వస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్ట్ రోజువారీ విచారణకు ఈ కేసును తీసుకున్నాక.. అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూ వస్తున్నది. ఇకపై ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో చూడాలి.