ప్రేమ గుడ్డిది.. దానికి రంగు రుచి వాసన వంటివి ఉండవు. కులం గోత్రం.. భాష ఉండదు. ప్రేమకు మనసు ఉంటె చాలు. అంతకు మించి మరేమి అవసరం లేదు. అయితే, ఇటీవల కాలంలో సేమ్ సెక్స్ ఉన్న వ్యక్తులు కూడా ప్రేమలో పడుతున్నారు. ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకొని ఒక్కటి అవుతున్నారు. అమెరికాలో స్థిరపడిన ఓ ఇద్దరు అబ్బాయిలు ఇటీవలే అలా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని బెంగాల్ రాష్ట్రంలో అబ్బాయి అమ్మాయిగా మారి, అమ్మాయి అబ్బాయిగా మారి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పుడు అహ్మదాబాద్ లో మరో జంట అలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే, ఇక్కడ ఇద్దరూ అమ్మాయిలే. అహ్మదాబాద్ లోని గీతమందిరం ప్రాంతానికి చెందిన పాయల్, మాన్సి అనే ఇద్దరు యువతులు ఈనెల 18 వ తేదీన ఇంటినుంచి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు ఏమయ్యారు అర్ధంగాక వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువతులను పట్టుకున్నారు.
అయితే, ఆ ఇద్దరు యువతలు చెప్పిన మాటలు విని షాక్ అయ్యారు. ఇద్దరు గత 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, ఇద్దరి మనసులు కలిశాయని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. పైగా ఇద్దరు మైనర్లు కావడంతో వీరి పెళ్ళికి చట్టం ఒప్పుకోదు. అందుకే కోర్టు అనుమతితో ఉమెన్స్ ప్రొటెక్షన్ హోమ్ కు తరలించాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. కోర్టు అనుమతి రాగానే ఈ ఇద్దరు యువతులను ఉమెన్ ప్రొటెక్షన్ హౌస్ కు తరలిస్తారు. ఇటీవల కాలంలో సేమ్ సెక్స్ విషయంలో అనేక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇండియాలో ఇలాంటి పెళ్లిళ్లు అనుమతికి చట్టం లేదు. మరి వీరి విషయంలో ఎలా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఇద్దరు మేజరైన తరువాత కూడా వాళ్ళు ప్రేమలోనే ఉన్నాము పెళ్లి చేసుకుంటామని చెప్తే.. చట్టం అందుకు అంగీకరిస్తుందా.. ఏమో చూడాలి.