పాక్ బుద్ది మారలేదు.. అందుకే మన రాష్ట్రపతి విమానం..

NAGARJUNA NAKKA

గ్రామ సింహం తోక ఎన్ని సార్లు వంచినా.. తన బుద్ధి మార్చుకోదు అన్న విధంగా ఉంది పాక్ తీరు. కశ్మీర్‌ విషయంలో.. అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో.. భారత్‌ను ఇబ్బందికి గురి చేసే ఏ విషయాన్ని పాకిస్థాన్‌ వదులుకోవట్లేదు. భారత్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది.


భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, స్లోవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న ఉగ్రవాదంపై ఆయా దేశాల అగ్రనేతలతో చర్చలు జరపనున్నారు రాష్ట్రపతి. పర్యటనల్లో పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై దేశాధినేతలతో చర్చించనున్నారు. 
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు.. రాష్ట్రపతి పుల్వామా దాడుల గురించి దేశాధినేతలతో చర్చించడం దాయాది దేశానికి ఏ మాత్రం మింగుడు పడటంలేదు. కక్ష సాధింపుగా.. ఇందు కోసం పాక్ గగనతలంకు రాష్ట్రపతి విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది పాక్. భారత్‌ అభ్యర్థనను తాము సంపూర్ణంగా తిరస్కరిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారన్నారు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి  షా మహ్మద్‌ ఖురేషీ. భారత్‌ వైఖరి కారణంగానే అభ్యర్థనను నిరాకరించామని పాకిస్థాన్‌కు చెందిన వార్తా సంస్థలకు తెలియజేశారు ఖురేషీ.


బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్ తమ గగనతలంను భారత విమానాలకు పూర్తిగా మూసివేసింది. అయితే జూలై 16న తిరిగి తెరిచినప్పటికీ ఆ తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ పాక్ ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాల్సిన విమానాలు తమ సర్వీసులను రద్దు చేశాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌పై పీకల్లోతు ఆగ్రహం పెంచుకుంది పాకిస్తాన్. ఇక అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఈ క్రమంలోనే పిచ్చిప్రేలాపనలకు పోతోంది పాకిస్తాన్. కశ్మీర్ సాధనకోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్దం చేసేందుకైనా సిద్ధమంటూ.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిచ్చి ప్రకటనలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి భారత్‌కు రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. అంతేకాదు వాణిజ్య సంబంధాలను కూడా పాక్ వద్దనుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: