రివర్స్ టెండర్ సక్సెస్ అయ్యింది : అంబటి

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో దూకుడు పెంచారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు బట్టబయలు చేసే కార్యక్రమంలో పడ్డారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.  ఇక పోలవరం విషయంలో ఎన్నో మోసాలు జరిగాయని..పారదర్శకంగా ఏ ఒక్క పని జరగలేదని అధికార పార్టీవారు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు రివర్స్ టెండర్ పై ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా మంత్రి అంటి రాంబాబు మాట్లాడుతూ..రివర్స్ టెండరింగ్ ప్రక్రియ బ్రంహాండగా సాగిందని అన్నారు.  ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..ప్రభుత్వం పై ప్రతిసారి చంద్రబాబు విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది కాలకేయ, రాక్షస  ప్రభుత్వం అని అనడం ఛోద్యంగా ఉందని అన్నారు.  గత ప్రభుత్వం లో తాము చేసిన పనులకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.

చద్రబాబు కి కొన్ని పత్రికలు వంత పాడుతున్నాయని అన్నారు.  రివర్స్ టెండరింగ్ ప్రక్రియ బ్రంహాండంగా సక్సెస్ అయ్యింది..ప్రజాధనం దుర్వినియోగం కాకకుండా కాపాడ గలిగింది ఈ ప్రభుత్వం..దీన్ని అందరూ మెచ్చుకోవాల్సిన అంశం అని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: