ఎయిర్ ఏసియా బంపరాఫర్.. రూ.899కే విమానం ఎక్కేయండి

Durga Writes
కొంతమందికి చిన్నప్పటి నుండి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ ధరలు చూసి వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు విమానం ఎక్కేలా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా తాజాగా అదిరిపోయే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ పేరు బిగ్ సేల్ ఆఫర్. కంపెనీ ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్లను రూ. 899 ప్రారంభ ధరతో అందిస్తోంది.  


అయితే ఇక్కడే ఈ ఆఫర్ లో చిక్కుంది. దేశీ ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 24 నుంచే ఎయిర్‌ ఏసియా ఇండియా బిగ్ సేల్ ప్రారంభమైంది. ఈ ఆఫర్ వినియోగించుకోవడం కోసం ఈ రోజే చివరి రోజు. ప్రయాణికులు ఎయిర్ ఏసియా ఇండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.


బిగ్‌ మెంబర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు కలిగిన వారు 24 గంటల ప్రియారిటీ యాక్సెస్ సదుపాయం పొందొచ్చు. దీని కోసం ప్రయాణికులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్‌లో టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు 2020 ఫిబ్రవరి 10 నుంచి 2020 డిసెంబర్ 15 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించచ్చు. కంపెనీ ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి ట్విట్టర్ కస్టమర్లకు తెలియజేసింది. మరి విమానం ఎక్కాలనుకున్నవారు వెంటనే ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. 


The #AirAsiaBIGSale is now LIVE! Only 4 DAYS to enjoy this crazy deal. Book now at https://t.co/N0YlsasHsI
Log in as a BIG Member to enjoy *FREE SEATS!
*Terms and conditions:https://t.co/nxdTnTMpWI
You can now enjoy zero processing fees when booking your flights to/from malaysia! pic.twitter.com/1oMBpGUQMs

— AirAsia (@AirAsia) September 22, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: