డాలర్ల లోటులో.. ఐరాస..
ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ షుమారు గా 37 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన కనబరిచారు. తాను జీతభత్యాలను చెల్లించేందుకు అదనపు చర్యలు తీసుకోవలసి ఉందని..,,, ప్రస్తుతం ఐరాస లోటు బడ్జెట్ 230 మిలియన్ డాలర్లని...,, ఈ నెలఖరుకు ఐరాస ఖజానా దాదాపు గా ఖాళీ అయ్యే అవకాశలున్నాయని...,,, అతను చెప్పుకొచ్చారు.. 2019 లో అవసరమైన నిధులలో 70 శాతం మాత్రమే సభ్య దేశాలు ఇచ్చినట్లుగా..,, దాని వలన సెప్టెంబరు చివరినాటికి 230 మిలియన్ డాలర్ల లోటు ఏర్పడిందని తాను వివరణనిచ్చారు. అక్టోబరు చివరినాటికి మిగులు నిధులు కూడా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని...,,
ప్రస్తుత ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలిపారు. అధికారిక పర్యటనలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు, సమావేశాల వాయిదా వంటి చర్యలను చేప్పట్టదలచినట్టుగా పేర్కొన్నారు.
ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి సభ్య దేశాలు కూడా తనవంతు బాధ్యత తీసుకోవాలని కోరారు.