మహిళలు అంటే అది పరాశక్తులు.... ఈ లోకానికి జన్మనిచ్చే దేవతలు... వారిని ఎంతో గౌరవించుకోవాలనే విషయం మృగాళ్లు మర్చిపోతున్నారు. ఏ చిన్న విషయంలో అయినా వారినే టార్గెట్గా చేసుకుంటున్నారు. వారి పుట్టుకే ఓ మహిళ అన్న విషయం చాలా మంది మృగాళ్లకు ఎక్కడం లేదు. దీంతో వారి కామ కోరికలకు వాళ్లను ఇష్టమొచ్చినట్టుగా వాడుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్నాం జిల్లాలో జరిగిన ఓ ఘోరమైన సంఘటన వళ్లు గగుర్పొడిచేలా ఉంది.
భార్యను ఆమె రెండేళ్ల కుమార్తెను అపహరించి నరకం చూపించాడు ఓ మాజీ భర్త. రత్నాం జిల్లాకు చెందిన ఓ మహిళకి ఏనిమిదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహవైంది. వారికి ఇద్దరు సంతానం... వీరి మధ్య గొడవలు ప్రారంభమై పెద్దవి కావడంతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకోగా ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లాడింది. దీనిని జీర్ణించుకోలేని మొదటి భర్త తన మాజీ భార్యపై మరింత కక్ష్య పెంచుకున్నాడు.
ఆ మహిళను రెండేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి నిర్జివ ప్రదేశంలోకి తీసుకుకెళ్లాడు. ఆ భర్త చెల్లెలి ఇద్దరు కుమారులు కూడా ఇందుకు సహకరించారు. వారు ఆమెను చిన్నారి చూస్తుండగానే సామూహికంగా రేప్ చేశారు. ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించడంతో పాటు దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను నగ్నంగా చేసి ఆమె శరీరంపై సిగరెట్లతో ఇష్టం వచ్చినట్టు కాల్చారు. అనంతరం ఆమెను ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు.
స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి దగ్గర వాంగ్మూలం తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బాధితురాలి మాజీ భర్త పరారీలో ఉన్నారు ఇద్దరు మేనల్లుళ్లను అరెస్ట్ చేశారు.