ప్రధాని మోడీ .. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు తమిళనాడులోని మహాబలిపురంలో మీట్ అయ్యారు. రెండు దేశాల మధ్య సదస్సు మహాబలిపురంలో జరిగింది. ఈ సదస్సులో అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. అంతేకాదు, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. బోర్డర్ సమస్యల గురించి చర్చించుకున్నారు. ఈనెల 11 వ తేదీన మహాబలిపురంలో మోడీ, జిన్ పింగ్ లు శోర్ దేవాలయంలో మీట్ అయ్యారు.
దేవాలయానికి సంబంధించిన వివరాలను మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు వివరించారు. అంతేకాదు, మోడీ, జిన్ పింగ్ ల సమావేశం జరగబోతున్నది కాబట్టి, మహాబలిపురం దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అద్భుతంగా తీర్చి దిద్దారు. దీంతో మహాబలిపురంకు కొత్త శోభ వచ్చింది. ఈ మీటింగ్ పూర్తికాగానే.. మహాబలిపురం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.
రోజు పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఈ సదస్సు పూర్తైన తరువాత మహాబలిపురానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఏకంగా లక్షలమంది మహాబలిపురాన్ని సందరిస్తున్నారు. ఈ సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దటంతోపాటు, అంతకు ముందు అనుమతులు లేని చోట్లకు కూడా పర్యాటకులను అనుమతించారు.
దీంతో ప్రజలు పెద్దఎత్తున మహాబలిపురం చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇలా రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో.. తమిళనాడు ప్రభుత్వానికి ఆధారం పెరుగుతున్నది. తమిళనాడు దేవాలయాల్లో ఇలా మోడీ సదస్సులు నిర్వహిస్తే.. ఆ దేవాలయాలకు సందర్శకుల సంఖ్య మరింతగా పురుగుతుంది. ఏమంటారు పళనిస్వామి గారు. ఆదాయం ఫుల్ గా వస్తున్నది. వీకెండ్స్ లో మాములుగా ఇలాంటి ప్లేస్ లకు తాకిడి ఎక్కువుగా ఉంటుంది. మోడీ సందర్శించి వెళ్లిన తరువాత ఈ తాకిడి మరింతగా పెరగడం విశేషం.