మరాఠా వార్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయ్యింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగబోతున్నది. అన్ని పార్టీలు తమ శక్తి మేరకు ప్రచారం చేశాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. బీజేపీ... శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాగా, ఇప్పుడు మరలా రెండోసారి ప్రభుతం అధికారంలోకి రావాలని చూస్తున్నది. కాంగ్రెస్.. ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే, ఈ కూటమిని అనేక ఇబ్బందులు ఇరకాటంలో పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు పార్టీలను సిబిఐ, ఈడీ కేసులు ఇబ్బందులు పెడుతున్నాయి. పీసీబీ కేసు కాంగ్రెస్, ఎన్సీపీ మెడకు చుట్టుకుంది.
ఈ కేసులో అనేకమంది నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అండర్ వరల్డ్ డాన్ దావుద్ తో ఎన్సీపీకి సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. ఆ పార్టీ ఇరకాటంలో పడింది. ఇటీవలే ఓ జాతీయ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆ రెండు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి. పైగా, ఈ రెండు పార్టీల జెండాను మోసుకొని.. తిరిగే బలమైన నాయకుడు ఆ రాష్ట్రంలో కనిపించడం లేదు. ఇది ఎన్డీఏ కు వరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున
{{RelevantDataTitle}}