పాక్ నిజం చెప్తోందా..భార‌త్ అబ‌ద్దం ఆడుతోందా....ఏది నిజం?

Pradhyumna
జ‌మ్మూక‌శ్మీర్‌లోని తంగ్‌దార్‌, కీర‌న్ సెక్టార్ల వ‌ద్ద భార‌త ఆర్మీ చేసిన ప్ర‌తీకార దాడుల్లో ప‌ది మంది వ‌ర‌కు పాక్ జ‌వాన్లు హ‌త‌మైన‌ట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ ఆదివారం ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాక్ మిలిట‌రీ ప్ర‌తినిధి మేజ‌ర్‌ జ‌న‌ర‌ల్  అసిఫ్ గ‌ఫూర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేశామ‌ని భార‌త ఆర్మీ చీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న నిరుత్సాహాప‌రుస్తున్న‌ద‌ని పాక్ గ‌ఫూర్ తెలిపారు. బిపిన్ రావ‌త్‌ అవాస్త‌వ ప్ర‌క‌ట‌న చేశార‌ని పేర్కొన్నారు. 


భార‌త ఆర్మీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...భారత సైన్యం దృష్టి మళ్లించేందుకు పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో కాల్పులకు దిగింది. కాల్పుల ముసుగులో ఉగ్రవాదులను సరిహద్దు దాటించే వ్యూహాన్ని పాక్ రచించింది. విషయం గ్రహించిన భారత్ సైన్యం పాక్ సైన్యాన్ని ధీటుగా తిప్పి కొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పాక్ సైనిక పోస్టులు, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. జురా, అతుమ్ ఖామ్, కుందల్ సాహిలో శతుఘ్నులతో భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాక్ సైనికుల, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లు ధ్యంసమయ్యాయి. ఈ దాడిలో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. పాక్ సైనికులు 6 నుంచి 10 మంది వరకు మరణించినట్లు పేర్కొంది. 


అయితే,  {{RelevantDataTitle}}