వేదింపులు ఎక్కువడంతో మరో విద్యార్ధి బలి.. అసలు కారణం ఇదే?

satvika
ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ లేదు అని అందరికి తెలుసు. ఆడదానిలో అమ్మను లేదాసోదరిని చూడాలని అప్పటిలో అనేవారు కానీ ఇప్పుడు మాత్రం కొంచం వేరేలా ఆమాటను మార్చుకున్నారు. మన సొంత తల్లి చెల్లి తప్ప తక్కినా ఆడవాళ్ళూ నాకు ప్రియురాళ్లతో సమానం అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు. అందుకే అమ్మాయిలపై అఘాయిత్యాలు కూడా పెరుగుతున్నాయి. 


చట్టాలు మారాయి, శిక్షలు కూడా మారాయి కానీ కామ కోరికలకు బలైయ్యే ఆడవాళ్ళ సంఖ్యా తగ్గడం మాట అటుంచి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివరాల్లోకి వెళితే.. విశాఖ లో కేజీహెచ్‌‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖను గడగడ లాడించింది.నర్సింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న బేబీ శివ లక్ష్మి అనే విద్యార్ధి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 


ఈ విషయాలను చూసిన మిగిలిన విద్యార్థులు ఆమె చనిపోయిందని గమనించి వెంటనే హాస్టల్ యాజమాన్యానినికి సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని కిందకు దించారు.నాన్ టీచింగ్ స్టాఫ్ వేధింపుల వల్లే శివలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు వదంతులు రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తులు చేపడుతున్నారు. 


శివలక్ష్మి  అనకాపల్లి నుంచి వచ్చి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. ఇంకో మూడు నెలల్లో ఆమె కోర్సు పూర్తికావొస్తున్న సమయంలో తమ బిడ్డ ఇలా తొందరపడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరైయ్యారు. ఆదివారం ఉదయం కూడా తమతో ఫోన్లో బాగానే మాట్లాడిందని, ఒక్కరోజులోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని వాపోతున్నారు. ఆమె ఎందుకు ఆత్మ హత్య చేసుకుందో  అనే విషయాలను పరిగణలోకి  తీసుకొని  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు..వేధింపులకు అడ్డు కట్ట వేసే చట్టాలు రావాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: