కసాయి కీర్తి తన కన్న తల్లిని హత్య చేసిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన రెండో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సమీపంలోని హయత్ నగర్ లో జరిగిన ఈ సంఘటన మానవ సంబంధాలకే మాయని మచ్చ మిగిలింది. తాజాగా ఈ కేసు విషయంలో మరో కొత్త కోణం కూడా వెలుగు చూసింది. ఇద్దరు ప్రియుళ్లతో ప్రేమాయణం వద్దు అన్నందుకే తల్లిని కసాయి కూతురు కీర్తి హత్య చేసినట్టు వెలుగు చూసింది.
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ సొంత ఇళ్లు కూడా కట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో కీర్తిని గారాబంగా పెంచారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోన్న ఆమె పక్క కాలనీకి చెందిన బాల్రెడ్డితో ప్రేమలో పడగా రెండు కుటుంబాల వారు వారి ప్రేమను అంగీకరించారు. త్వరలోనే వీరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు.
అయితే కీర్తి తన ఇంటి వెనక ఉన్న శశికుమార్ అనే యువకుడితో కూడా ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇది గమనించిన తల్లి కీర్తిని హెచ్చరించింది. పెళ్లి కుదిరాక మరో యువకుడితో ఇలా చేయడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చింది. అయితే అప్పటికే ఈ ఇద్దరు యువకులతోనూ కీర్తి హద్దులు దాటేసిన విషయం గమనించిన తల్లి కీర్తిని పద్ధతిగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన రెండో ప్రియులు శశికుమార్తో కలిసి తల్లిన ఈ నెల 19న హతమార్చింది.
తల్లి మృతదేహన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుని రెండో ప్రియుడితో ఆమె రాసలీలలు కొనసాగించింది. చివరకు దుర్వాసన రావడంతో తల్లి మృతదేహం తన స్వగ్రామం అయిన రామన్నపేటలో పడవేసి వచ్చారు. ఆ తర్వాత తాను టూర్కు వెళుతున్నట్టు చెప్పి... చివరకు శశికుమార్ ఇంట్లోనే అతడితో మూడు రోజుల పాటు రాసలీలలు కొనసాగించింది. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన కీర్తి తండ్రి భార్య రజిత కనపడడం లేదని కూతురుకు ఫోన్ చేయగా.. తాను హడావిడిగా టూర్ నుంచి మధ్యలో వచ్చినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది.
చివరకు తన తండ్రి తాగివచ్చి తల్లిని హింసించే వాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తండ్రి శ్రీనివాస్ షాక్ తినగా.. బంధువుల ఆమె టూర్ గురించి పలు ప్రశ్నలు వేయగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. చివరకు పోలీసుల విచారణలో తన రెండో ప్రియుడు శశికుమార్తో కలిసి తన తల్లిని తానే హత్య చేశానని చెప్పింది. పోలీసులు కీర్తీతో పాటు శశికుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.