ప్రజలు ఘోరంగా ఛీకొట్టారు.. సిగ్గున్నోడైతే ఆర్నెళ్లు బయట తిరగలేడు, కానీ చంద్రబాబు ?

Durga Writes
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుకు సిగ్గు లేదని ఘోరంగా అవమానించారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కొంచం కూడా సిగ్గు లేదని, మొన్న హుజుర్ నగర్ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారని.. ఆయన చంద్రబాబుకు సిగ్గులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.   


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. '' బతుకేమిటో మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మరో సారి తేట తెల్లమైంది. 1800 ఓట్లే వచ్చాయి. ఇండిపెండెంట్లు నయం. పార్టనర్ చాటుమాటుగా సహకరించినా, కోట్లు కుమ్మరించినా ప్రజలు అత్యంత ఘోరంగా అవమానించారు. సిగ్గున్నోడైతే ఆర్నెల్ల దాకా తలెత్తుకుని బయట తిరగలేడు.'' అంటూ ట్విట్ చేశారు. 


అయితే ఈ ట్విట్స్ పై కొందరు సానుకలంగా స్పందిస్తే.. మరికొందరు ఈ ట్విట్ ని కాండిస్తున్నారు. వ్యక్తిగత ట్విట్లు వొద్దు విజయసాయి రెడ్డి గారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. అతని బతుకు ఏంటో ఆంధ్ర ప్రజలందరికి తెలుసులెండి.. అందుకే ప్రజలు చంద్రబాబుని తరిమికొట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


@ncbn బతుకేమిటో మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మరో సారి తేట తెల్లమైంది. 1800 ఓట్లే వచ్చాయి. ఇండిపెండెంట్లు నయం. పార్టనర్ చాటుమాటుగా సహకరించినా, కోట్లు కుమ్మరించినా ప్రజలు అత్యంత ఘోరంగా అవమానించారు. సిగ్గున్నోడైతే ఆర్నెల్ల దాకా తలెత్తుకుని బయట తిరగలేడు.

— Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: