ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పైన పలు విధాలుగా పోస్టులు వస్తున్నట్టు తెలిసిన విషయమే దీన ఆయన చాల ఘాటుగా సమాధానమిచ్చారు.అయన పైన పోస్టులు చేసిన వారిపై ఫిర్యాదు చేసారని వివరించారు అస్సలు అయన ఏమన్నారంటే సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. అసభ్యకర పోస్టులు చేస్తూ.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించాలని ఈ మేరకు ఫిర్యాదు చేశానని నెహ్రూ యువ సంఘటన వైస్ ఛైర్మన్, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు 360, ట్విటర్ లోనే కాదు , టేక్ వన్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు .
కేవలం రాజకీయ కక్షతోనే ఆయన పైన ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని , ట్విట్టర్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని నాపైన దుష్ప్రచారంచేస్తున్నారని, దీని వల్ల రెండు వర్గాల చెందిన వారి మధ్య గొడవలు సృష్టించేల ట్విటర్లో చేసి పోస్టులు పెడుతుండడంపై వాపోయారు.
ఈ మేరకు తన పేరిట ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని నడుపుతున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టుల వలన సోషల్ మీడియాలో ఇతర కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండి వైరల్ అవుతోన్న కథనాలకు.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి జత చేయడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు కమీషనర్కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
నా పైన కక్షతోనే ఈ విధంగా తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు .