వంశీమోహన్ కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ ..
ఒంగోలు: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీకి రాజీనామా చేసిన వంశీ.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. జయంతికి.. వర్ధంతికి తేడా తెలియని వాళ్లు అంటే పడాలా? అని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ అదే స్థాయిలో స్పందించారు.
ఆస్తుల కోసమే వంశీ పార్టీ మారుతున్నారని.. అలాంటి వారు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.గతంలో కార్యకర్తలపై ఒత్తిడితోనే పార్టీ మారుతున్నానని చెప్పిన వంశీ.. వెంటనే జే టర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటికి వెళ్లాడని లోకేష్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ది 2009 వ్యవహారం.. ఇప్పుడు 2019లో ఉన్నాం.. ఆయన ఇంకా హ్యాంగోవర్లో ఉన్నాడంటూ వంశీపై లోకేష్ సెటైర్లు వేశారు.