పేరుకు ఆదా.. జగన్ ఇంటికి రో. 20కోట్లు

Balachander

రివర్స్‌ టెండరింగ్‌పేరుతో పోలవరం పనులుఆపేసిన రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రవ్యవసాయ రంగానికి తలమానికంగా నిలవాల్సిన సాగునీటిప్రాజెక్ట్‌ని మూలనపడేసిందని ఆలపాటి  మండిపడ్డారు. ప్రజాధనం మిగిల్చామని డబ్బాలు కొట్టుకుంటున్న రాష్ట్రయంత్రాంగం, జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రూ.20కోట్లు తగలేసిందని, బాత్రూమ్‌లకు రూ.10లక్షలు, కిటికీలకు రూ.80లక్షలు, రోడ్డు నిర్మాణానికిరూ.5కోట్లు ఖర్చుచేయడమేంటని ఆలపాటి నిలదీశారు. 

కేవలం అన్నాక్యాం టీన్ల రంగు మార్చడానికి రూ.1100కోట్లు ఖర్చుచేసిన జగన్‌ప్రభుత్వం ఎంతసొమ్ము ఆదాచేసిందో, ఎవరికి మేలుచేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నవరత్నాలపేరుతో రాష్ట్రప్రజల నవరంధ్రాలను మూసేసిన ఘనత జగన్‌ కే దక్కుతుందన్నారు. ప్రజల్ని భ్రమల్లో ముంచి, చంద్రబాబు సంక్షేమ పథకాలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లుతూ కాలక్షేపం చేస్తోందన్నారు. ఉచిత ఇసుకవిధాన ం రద్దుతో 30లక్షలమంది భవననిర్మాణ కార్మికులను రోడ్డునపడేసిన ప్రభుత్వం, జీవోల పేరుతో ప్రశ్నించేవారిపై తప్పుడుకేసులు పెడుతోందన్నారు. 

{{RelevantDataTitle}}