సవతి తల్లి ఘాతుకం.. చిన్నారిని చిధిమేసిన రాక్షసత్వం

Murali

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన చిన్నారి దీప్తిశ్రీ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమైన ఏడేళ్ల దీప్తిశ్రీని ఆమె సవతి తల్లి హత్య చేసి అనంతరం మూటలో కట్టి ఉప్పుటేరులో పడేసింది. దీప్తిశ్రీ మృతదేహాన్ని ఇంద్రపాలెం లాకుల వద్ద ధర్మాడి సత్యం బృందం గుర్తించింది.

 

 

పోలీసుల చేపట్టిన విచారణలో ఈ నిజాలు వెలుగు చూశాయి. పాప నానమ్మకు వచ్చిన అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు సవతి తల్లి శాంతికుమారిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. దీంతో పాపను తానే ఎత్తికెళ్లినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు ధర్మాడి సత్యం సహాయంతో ఉప్పుటేరులో దీప్తిశ్రీ గురించి గాలించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద చిన్నారి డెడ్ బాడీని గుర్తించారు. దీప్తిశ్రీ మృతదేహాన్ని చూసిన తండ్రి, నాయనమ్మ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. కాకినాడ -యానాం రోడ్డులో పగడాల పేటకు చెందిన శ్యామ్‌కుమార్‌ భార్య సత్యవేణి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో అదే గ్రామానికి చెందిన శాంతికుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 11నెలల బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టిన నాటి నుంచి దీప్తిని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించిందని పలువురు చెప్తున్నారు. చేతులపైనా, కాళ్లపైనా వాతలు పెట్టడం ఓసారి గంజి కూడా ఆమెపై పోసి హింసించిందని తెలుస్తోంది.

 

 

దీంతో నానమ్మ బేబి తన వద్దకు దీప్తిశ్రీని ఉంచి పెంచుతోంది. అయినా దీప్తినే బాగా చూసుకుంటున్నాడని శాంతకుమారి దీప్తిశ్రీని అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం స్కూలు దగ్గరకెళ్లి తనతో తీసుకెళ్లింది. శుక్రవారం పాప స్కూల్‌కు వెళ్లిన తర్వాత శాంతకుమారి దీప్తిశ్రీని తీసుకుని వెళ్లింది. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసు విచారణలో తానే హత్య చేసినట్టు ఒప్పుకుని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం పోలీసులనే ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: