విపక్షాలకు , యూనియన్ నేతలకు కేసీఆర్ ఊహించని ఝలక్
రాజకీయ ఎత్తుగడ వేయడమే కాదు, దాన్ని విజయవంతంగా ఎలా ముగించాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా, మరెవరికి తెలియదని మరోసారి రుజువయింది . అందుకే అయన విపక్షాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ, ప్రజల మన్నలను పొందుతున్నారు . చివరకు ఆర్టీసీ సమ్మె ముగింపు వ్యవహారంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినతీరు అందరి ప్రశంసలను చూరగొంటోంది . మూడు రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరుతామని చెప్పినా , చేర్చుకొని కేసీఆర్, కేబినెట్ భేటీ అనంతరం ఎటువంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకుంటానని ప్రకటించి యూనియన్ నేతలకు , విపక్షాలకు ఊహించని ఝలక్ ఇచ్చారు .
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన విధుల్లో చేర్చుకొమ్మని కోరిన చేర్చుకొని కేసీఆర్, పలు షరతులు విధించి వారిని విధుల్లోకి తీసుకుంటారని అందరూ ఊహించారు . అయితే కేసీఆర్ మాత్రం దానికి భిన్నంగా ఆర్టీసీ కార్మికులంతా తమ బిడ్డలేనని , వారిని ఎటువంటి షరతుల్లేకుండా చేర్చుకుంటామని ప్రకటించడం ద్వారా నిన్న , మొన్నటి వరకూ తమకు బద్ధ విరోధిగా భావించిన కార్మికులను ప్రస్తుతం తనవైపు తిప్పుకోవడం లో అయన సక్సెస్ అయ్యారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . అక్టోబర్ ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెల్సిందే .
సమ్మె ప్రారంభించిన నాటి, సమ్మె చట్టబద్ధం కాదని , యూనియన్ నాయకులను కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతూ వచ్చిన కేసీఆర్ , మరోసారి అదే విషయాన్ని చెప్పుకొచ్చారు . ఆర్టీసీ కార్మికులను రోడ్డు ను బజారు పాలు చేసింది యూనియన్ నేతలు , విపక్ష నాయకులేనని అయన మండిపడ్డారు . ఆర్టీసీ ని బ్రతికించుకొద్దామని చెప్పుకొచ్చారు .