24 గంటల్లోనే పెట్టేసుకున్నారు...
ఇటీవల కాలంలో దేశంలో హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా లాభం లేకుండా పోతున్నది. పోలీసులు నిత్యం పహారా కాస్తున్న ఎంతగా మోటివేషన్ చేస్తున్నా కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ ఈ అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మాత్రం ఇంకా సందేహంగానే ఉన్నది.
ఇక ఇదిలా ఉంటె, వరంగల్ జిల్లా హనుమకొండలో ఓ దారుణం జరిగింది. 19 ఏళ్ల ఓ యువతిని పుట్టినరోజునే అత్యచారం చేసి హత్య చేశారు. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి ఇలా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె సెల్ ఫోన్ ఆధారంగా విషయాలను తెలుసుకున్నారు. 24 గంటల లోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. గాదం మానస అనే యువతి బుధవారం రోజున మధ్యాహ్నం సమయంలో గుడికి వెళ్ళొస్తానని వెళ్ళింది.
అలా గుడికి వెళ్లిన యువతి రాత్రి 9:50 గంటలకు హంటర్ రోడ్డులో శవమై కనిపించింది. మధ్యాహ్నం గుడికి వెళ్లిన ఆ యువతి గురించి ఆరా తీయగా.. ఆమెకు జనగామలోని నలిమికొండకు చెందిన పులి సాయిగౌడ్ హనుమకొండలో ఓ ప్రైవేట్ స్కూల్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ యువకుడు, ఆరు నెలల క్రితం మనసుతో పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు.
కాగా, పుట్టినరోజు కావడంతో మనసును అదాలత్ జంక్షన్ నుంచి కాజీపేటకు వెళ్ళింది.. అక్కడి నుంచి మానసను కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే, యువతి రక్తస్రావం కావడంతో మరణించింది. దీంతో ఆ యువతిని కారులోనే అటు ఇటు తిప్పి సాయంత్రం కొత్తబట్టలు మార్చి రాత్రి 9:30 గంటల సమయంలో అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన కుటుంబ సభ్యలు, రాత్రి మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్ట్ మార్టం అనంతరం పోలీసులు అత్యాచారం చేసిన హత్య చేసిన సాయి గౌడ్ ను పోలీసులు తన సొంత గ్రామంలో పట్టుకున్నారు. నిందితుడిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు.