చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు ఎందుకంటే?

venugopal

గత కొద్ది కాలంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతల తీరు అనుమానాస్పందంగా ఉందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మాటలు పక్కన పెడితే ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా బాబు తప్పులు వెతుకుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజధానిలో పర్యటించిన సందర్భంగా ఆయనపై చెప్పులు, రాళ్లు విసిరిన వారిని అరెస్ట్‌ చేసి వెంటనే చర‍్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

 

 

కాని టీడీపీ నేతలు మాత్రం దాడి చేయించింది డీజీపీ అని మాట్లాడటం సరికాదన్నారు. చెప్పులు వేయించే సంస్కృతి పోలీసులది కాదని, చరిత్ర తిరగేస్తే అది ఎవరి సంస్కృతో అర్థం అవుతుందని, పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని వెల్లడించారు. అంతే కాకుండా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు అంటే పోలీసులకు గౌరవం ఉందని, అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఆ గౌరవాన్ని పోగొడుతున్నారన్నారు. పోలీసులపై అభాండాలు వేయడం టీడీపీ నేతలకు ఫ్యాషన్‌ అయిపోయిందని విమర్శించారు.

 

 

ఇక టీడీపీ అనుమతి ఇస్తే ఒక రకంగా, ఇవ్వకపోతే మరో రకంగా ద‍్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని శ్రీనివాస్‌ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలతో టీడీపీ నేతలు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున‍్నారన్నారు. పోలీస్‌ బాస్‌ను టార్గెట్‌ చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

 

పోలీసుల మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే న్యాయ పోరాటానికి దిగేందుకు వెనకాడేది లేదని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఇకపోతే టీడీపీ నేతలు ప్రతి దానిలో వేలుపెట్టి బురద అంటించుకొని అబాసుపాలవుతున్న వారికి జ్ఞానం రావడం లేదని కొందరి అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: