చిట్టినాయుడు.. ప్లీజ్ కాస్త ఓపికపట్టు!!

Durga Writes

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

 

ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ ని కూడా దారుణంగా కామెంట్లు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 58 కోట్ల రూపాయలను సింగపూరుకు మళ్లించేశాడంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ని కాస్త చుడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్ల రూపాయలను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్లించేశాడు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్‌ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడు. ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడు. 58 కోట్ల రూపాయల స్కామ్‌పై విచారణ జరుగుతోంది. ఓపికపట్టు చిట్టీ!'' అని విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: