జనసేన ఒక చిల్లర పార్టీ... బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు...!

Reddy P Rajasekhar

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతిలో జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందూ రాజకీయ నేతలు ప్రజలను మతాల పేరిట విడగొడుతూ రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజాసింగ్ జనసేన పార్టీలో హిందువులు లేరా..? పవన్ కళ్యాణ్ హిందువు కాదా..? అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. 'ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ హిందువుల గురించి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని రాజాసింగ్ అన్నారు. పవన్ కళ్యాణ్ హిందువులు కొట్లాటలు పెట్టేవాళ్లని వ్యాఖ్యలు చేస్తున్నారు... పవన్ కళ్యాణ్ హిందువేనా...? లేక పవన్ కళ్యాణ్ మతం మారారా...? అని రాజా సింగ్ ప్రశ్నించారు. 
 
హిందూ సమాజాన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని రాజా సింగ్ అన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న జనసేన పార్టీ చిల్లర పార్టీ అని రాజాసింగ్ అన్నారు. 
పవన్ కు హిందూ సమాజం గురించి తెలియదనుకుంటా అని రాజా సింగ్ అన్నారు. హిందూ ధర్మం ఉండొద్దనుకుంటే నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పాలని రాజా సింగ్ అన్నారు. ఎన్నికలు అయిపోయాయని ఇప్పుడెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావ్..? అని రాజాసింగ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. 
 
తాను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానినేనని రాజాసింగ్ చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను పేరు పెట్టి పిలవాలన్నా ఏదో విధంగా ఉందని రాజాసింగ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో మత రాజకీయాలు ఆడేది, మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ రాజకీయనేతలే అని వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని పవన్ అన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని పవన్ వ్యాఖ్యలు చేశారు. పలు వర్గాల నుండి పవన్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: