నౌకాదళ దినోత్సవానికి సతీసమేతంగా సీఎం జగన్..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేవీ డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరు కానున్నారు. ఈ సందర్బంగా నిర్వహించే నౌకా దళ విన్యాసాలను జగన్ దంపతులు తిలకించనున్నారు. పాకిస్థాన్పై విజయాకి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4 తేదీన నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది జరిగే ఈ వేడుకలకు ముఖ్య అత్యిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. విశాఖ రామ క్రిష్ణా బీచ్ లో ఈసారి సిఎం జగన్ సమక్షంలో నేవీ డే విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. తూర్పు నౌకాదళ (ఈఎన్సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాకి హాజరయ్యేందుకు సీఎం నిర్ణయించుకున్నారు . దీనితో జగన్ విశాఖపట్నం పర్యటన కార్యక్రమం ఖరారైంది. ఆ మేరకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం నాటి పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
సతీసమేతంగా..
నేవీ డే ఉత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈఎన్సీ చీఫ్ జైన్ కోరారు. ఇటీవల అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయాకి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు సీఎం దంపతులు విచ్చేయాలని ఈఎన్సీ చీఫ్ అభిలషించారు.
జగన్ పర్యటన ఇలా ..
సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. 2.20 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. విమానంలో మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాన్నం 3.40 గంటలకఁ సర్క్యూట్ హౌస్కు విచ్చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సర్క్యూట్ హౌస్ నుంచి నేవీ విన్యాసాలు జరిగే ఆర్కే బీచ్ వద్దకు బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ జరిగే నేవీ డే విన్యాసాలు, ప్రదర్శనలను తిలకిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్ హౌస్కు చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు నేవీ హౌస్కు బయలుదేరతారు. అనంతరం ఈ సాయంత్రం 6.20 నుంచి 7 గంటల వరకు అక్కడ జరిగే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడు గంటలకు నేవీ హౌస్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు విమానంలో బయలుదేరి 8.10 గంటలకఁ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి జగన్ దంపతులు చేరుకుంటారు.