పవన్ కళ్యాణ్ 'అంతఃపుర రహస్యాల'ను బయట పెట్టిన విజయసాయి రెడ్డి..?
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.
సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ ని తన మాటలతో ఏకిపారేస్తుంటారు విజయసాయి రెడ్డి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కు తన ట్వీట్లతో ముచ్చెమటలు పట్టించే విజయసాయి రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ అంతఃపుర రాహస్యాల గురించి ట్విట్టర్ వేధికగా స్పందించారు. దీంతో ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే తెలిసినవే. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాసాడంటే ఎవరూ నమ్మలేదు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదు.'' అంటూ ట్విట్ చేశారు.
ఈ ట్విట్ కి స్పందించిన కొందరు నెటిజన్లు.. 'బెత్తం నాయుడుకు ఇది అలవాటే, క్రెడిట్ అంటే ముందు ఈయనే ఉంటాడుగా... పార్ట్నర్ సావాసం యాడికి పోతాది.?'' అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ తో ట్విట్టర్ లో జనసేన.. వైసీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.
రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే తెలిసినవే. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాసాడంటే ఎవరూ నమ్మలేదు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదు. — Vijayasai reddy V (@VSReddy_MP) December 15, 2019