ముఖ్యమంత్రి జగన్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన టీడీపీ.
అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుండి అసెంబ్లీ లో ఎదో ఒక విషయం గురించి గొడవలు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం రోజు న అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై సభలో చర్చ జరిగింది. ఈ చర్చ అస్సాంబ్లీ లో తీవ్ర దుమారమే లేపింది చర్చ జరుగుతున్నా సమయంలో టీడీపీ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు సిగ్గు లేదంటూ ఆయన మీద ఆయన పార్టీ ఎమ్మెల్యే ల మీద విరుచుకుపడ్డారు. బఫూన్లలా టీడీపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆయన మాటలు అదుపు లో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సభాహక్కుల కు నోటీస్ ఇచ్చారు .
ఈ విషయం లో సత్వరమే జగన్పై చర్యలు తీసుకోవాలని ఆయన అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసారు అని అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన ఫిర్యాదులో అయన పేర్కొన్నారు. రూల్ నెంబర్ 169 కింద సీఎం జగన్తో పాటూ కొందరి మంత్రులపైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు.
గత శుక్రవారం కూడా టీడీపీ జగన్పై ప్రివిలైజ్ మోషన్ ఇచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ గేటు దగ్గర.. మార్షల్స్తో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొడవ విషయంలో ప్రతిపక్ష నేత అనని మాటల్ని అన్నట్లుగా వక్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కలిసి ఫిర్యాదును అందజేశారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోసారి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.