వృద్ధ్యాప్య సమస్యల వల్ల చంద్రబాబుకి మతిమరుపు భారీగా పెరిగింది..!

Durga Writes

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''వృద్ధ్యాప్య సమస్యల వల్ల చంద్రబాబుకి మతిమరుపు పెరిగింది. శ్రీకాకుళంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశామని అసెంబ్లీలో దబాయించబోయాడు. స్పీకర్ గారు అప్రమత్తంగా ఉండి ఏ లిఫ్ట్ అని ప్రశ్నించడంతో ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేశామని మాట మార్చాడు. నవ్వుల పాలయ్యాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

అయితే.. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయారు అని విజయసాయి రెడ్డి ఎప్పుడు వ్యాఖ్యానిస్తునే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మరోసారి సంచలనమైన వ్యాఖ్య చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ కారణంగా కొంతమంది తెలుగు దేశం పార్టీ వీరాభిమానులు తీవ్ర మనస్థాపానికి గురయ్యి విజయసాయి రెడ్డిపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ట్విట్ కారణంగా ట్విట్టర్ లో వైసీపీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులపై మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. మరి ఈ ట్విట్ పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: