కానీ అనంతపురంలో టూర్ ముగించుకుని అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత ఎల్లోమీడియా యాజమాన్యంతో మాట్లాడారని సమాచారం. దాని తర్వాత హఠాత్తుగా సోమవారం యూటర్న్ తీసుకున్నారు. జగన్ ప్రకటనపై దాదాపు వారం రోజులుగా ఆందోళనలు చెబుతున్నా జనాలకు చంద్రబాబు కనీసం మద్దతు కూడా చెప్పలేదు. అలాంటిది సోమవారం తుళ్ళూరుకు వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళకు మద్దతుగా స్పీచులివ్వటం ఆశ్చర్యంగా ఉంది.