మూడు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్ల ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను ప్రకటించింది. అయితే మున్సిపాలిటీ యూనిట్గా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించారు. 23 వార్డులకుగాను ఆ ప్రకారం సత్తుపల్లిలో.. ఎస్టీ జనరల్కు ఒక వార్డు కేటాయించారు. ఎస్సీలకు మూడు.. ఎస్సీ జనరల్ రెండు వార్డులు , ఎస్సీ మహిళకు ఒక వార్డు కేటాయించారు. బీసీలకు 7 సీట్లు కేటాయించగా.. 4 బీసీ జనరల్కు, 3 బీసీ మహిళకు కేటాయించారు. మహిళలకు 7 వార్డులు కేటాయించగా.. 5 సీట్లు జనరల్కు కేటాయించారు. 22 వార్డులు మధిర మున్సిపాలిటీలో ఉండగా.. ఒక వార్డు ఎస్టీ జనరల్కు కేటాయించారు. 6 వార్డులు ఎస్సీలకు.. మూడు వార్డులు ఎస్సీ జనరల్కు, 3 ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 4 సీట్లు కేటాయించగా.. 2 బీసీ జనరల్కు, 2 బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మహిళలకు 6 వార్డులు రిజర్వు చేయగా.. జనరల్కు 5 వార్డులు కేటాయించారు.
వైరాలో 20 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఎస్సీలకు 5 వార్డులు కేటాయించగా.. 3 ఎస్సీ జనరల్కు, 2 వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు చేశారు. వీటిలో 2 బీసీ జనరల్కు, 2 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 6 జనరల్ మహిళకు, 4 జనరల్కు కేటాయించారు. మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో సీటును ఎస్టీలకు కేటాయించారు.
ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించారు. మొత్తం 23 వార్డులు సత్తుపల్లిలో ఉండగా.. మహిళకు కలిపి 11 వార్డులు ఎస్సీ, బీసీ జనరల్ కేటాయించారు. అలాగే మధిరలో 22 వార్డులకు గాను.. 11 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు కేటాయించారు. వైరాలో 20 వార్డులకు గాను.. 10 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ప్రతి మున్సిపాలిటీలోనూ మహిళా ప్రాతినిధ్యం 50 శాతం ఉండనున్నది.