మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠం ఎవరిది ?
ఇప్పటి వరకు బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో ఆరుసార్లు ఎన్నికలు జరుగగా ఏడుగురు అభ్యర్థులు చైర్మన్గా వ్యవహరించారు. వీరంతా కార్మిక కుటుంబాల నుంచి ఎన్నిక కావడం విశేషం. చైర్మెన్ అభ్యర్థిపైనే ప్రస్తుతం పుర ప్రజల దృష్టంతా కేంద్రీ కృతమై ఉంది. ఈదఫా ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్మెన్ సీటులో కూ ర్చోబెడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ఓటరు మహాశయులు గత చరిత్రను పున:రావృతం చేస్తారా లేదా కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతారా అనేది తేలాల్సి ఉంది.
కార్మిక కుటుంబాలకు బెల్లంపల్లి మున్సిపల్ చైర్మెన్గా చెందిన వ్యక్తులే ఎన్నికవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆరు సార్లు మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఎన్నికలు జరిగాయి. ఏడుగురు మున్సిపల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి రాణించారు.ప్రథమంగా 1987లో బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్ సర్దార్గా పనిచేస్తున్న ఇరిగిరాల చంద్రశేఖర్ (టీడీపీ) పోటీ చేసి తొలి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 1992లో రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో ఫిట్టర్గా పని చేస్తున్న అమురాజుల రాజేశ్వరరావు (టీడీపీ) మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ క్రమంలోనే సింగరేణిలో సంక్షేమాధికారిగా పదోన్నతి రావడంతో రాజేశ్వరరావు చైర్మన్ పదవికి అర్థాంతరంగా {{RelevantDataTitle}}