మద్రాస్ అభివృద్ధికి కృషి చేశా.. ఇంకా నమ్ముతారనే..?
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగువారు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడంలేదన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందని చెప్పారు. అమరావతి కేంద్రంగా వేల ఏళ్ల క్రితమే రాజ్యం ఉండేదని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఒకప్పుడు మద్రాస్ అభివృద్ధికి, తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తాను కృషి చేశామన్నారు. అమరావతిని చించాలంటే భవిష్యత్ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. భోగి మంటల కార్యక్రమంలో రాజధాని రైతులు, మహిళలు, యువత భారీగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాక అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేపట్టింది. గతంలో 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని కాదని ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చింది. ఇందులో రాజధాని అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. తదనుగుణంగా సీఆర్డీయే ఏర్పాటుతో పాటు 33 వేల ఎకరాల భూసమీకరణకు సిద్దపడింది. అయితే రాజధానిలో భాగంగా ఉన్న ఉండవల్లి, పెనుమాకతో పాటు పలు గ్రామాల రైతులు మూడు పంటలు పంటే తమ సారవంతమైన భూములను రాజధానికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు.