భ్రమరావతి: అమరావతి ఆ కొందరి రాజధానేగా..?
అమరావతి.. ఈ పేరు 5 సంవత్సరాల ముందు ఏపీ ప్రజలకు కూడా తెలియదు.. కానీ ఆ పేరు ఉన్న ఊరు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయ్యింది. బాగా పంటలు పండుతున్న భూమిపై ఓ నర రూప రక్షేశుడి కన్ను పడి పచ్చని పంటలు నిప్పులల మారాయి. రాజధాని అయినా అమరావతిలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రజలకు భ్రమలు కల్పించి ఏదో చెయ్యాలనుకున్నాడు చంద్రబాబు.
అభివృద్ధి ఏది నాయన అని ప్రజలు అడిగితే ఇదిగో అని అమరావతిలో గ్రాఫిక్స్ చూపించాడు.. అమరావతి అని కోట్లు కోట్లు తిన్నాడు.. కానీ ఏమి ప్రయోజనం.. అమరావతి అని ఉన్న మంచి పేరును భ్రమరావతి చేశాడు చంద్రబాబు నాయుడు. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం వచ్చింది.. కొత్త నాయకుడు వచ్చాడు.. అమరావతిని ఒక్కటే అభివృద్ధి ఎందుకు..? రాష్ట్రమంతా చేద్దాం అన్నాడు..
అందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు సీఎం జగన్.. ఇంకా అంతే.. ఎక్కడ రాజధానిలో తన ఆస్తులు పోతాయో అని చంద్రబాబు కొంతమంది రైతులతో.. ఎంతోమంది పెయిడ్ ఆర్టిస్టులతో రచ్చ రచ్చ చేస్తున్నాడు.. అయితే ఇది అంత చుసిన మరికొందరు ప్రజలకు.. రాష్ట్రం అంటే అన్ని జిల్లాలు కదా ? ఒక్క 29 ఊళ్ళేనా అని అడుగుతున్నారు..
అంతే కాదు... అమరావతి అంటే.,. అందరిదా? కొందరిదా? ఈ ప్రశ్న తరచుగా ప్రజల మధ్యతిరుగుతోంది. గత సీఎం చంద్రబాబు దీనిని కొందరికి మాత్రమే పరిమితం చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి మీరు ఏమి అనుకుంటున్నారు ? అమరావతి రాజధాని అందరిదీ అనుకుంటున్నారా ? లేక కొందరిదేనా ? ఎం అనుకుంటున్నారు చెప్పండి..