రాజధాని తరలింపుపై జగన్ దూకుడు చూస్తుంటే.. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చినట్లు, దానిపై ప్రధానితో ముందస్తుగానే మాట్లాడి విశాఖకు తరలించారన్నది నిజమనే తేలిపోయింది. అంటే.. బిజెపి నాయకత్వం, రాష్ట్ర పార్టీ నేతలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమయింది. బిజెపి పుణ్యపురుషులైన మోదీ-అమిత్షా, ఏపీలో జగన్తో ఒకవైపు దోస్తానా చేస్తూ, మరోవైపు అవకాశం కోసం చూస్తున్నారనీ అర్ధమవుతోంది. అందుకే ఇక్కడ రాజధాని తరలింపుపై రాష్ట్రంలో  ఎంత యాగీ జరుగుతున్నా, సీఎం జగన్ ఎలాగైతే ఇప్పటివరకూ పెదవి విప్పలేదో.. అదే అంశంపై సొంత పా