చంద్ర‌బాబుకు ఆ రోగం ఉంది... వైసీపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

Reddy P Rajasekhar

ఏపీ అసెంబ్లీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం అసెంబ్లీలో కొంత సమయం పాటు గందరగోళం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా అమరావతి గురించి చర్చకు పట్టుబట్టారు. జై అమరావతి జై అమరావతి అంటూ సభలో నినాదాలు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అదే సమయంలో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశమిచ్చారు.                 
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు నవ్వడం తెలియదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నవ్వడం ఒక భోగం అని నవ్వకపోవడం ఒక రోగం అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 
 
చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఏమీ చేయలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ సింగిల్ గా వెళతారు తప్ప తెలుగుదేశం పార్టీలా పొత్తుల కొరకు పాకులాడరని అన్నారు.  పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 
 
ఎప్పుడు ఏ పార్టీతో కలుద్దామా అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని గతంలో కూడా ఇదే విధంగా చేశారని చెప్పారు. జీవితమంతా చంద్రబాబు ఏడుపు ముఖంతోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. పొత్తు లేనిదే ముద్ద దిగని మీరా మాట్లాడేది అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: