ఎన్టీఆర్ వెన్నుపోటు స్కెచ్ అమలు చేసింది ఎవరో తెలుసా?

Durga Writes

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వెన్నుపోటు స్కెచ్ అమలు చేసిన వ్యక్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎప్పుడు ప్రతిపక్షాలకు ట్విట్టర్ వేదికగా గట్టి సమాధానాలు ఇచ్చే విజయసాయి రెడ్డి ఈరోజు తన ట్వీట్లతో ప్రతిపక్ష నేతలకు ఉపరి ఆడకుండా చూశారు.. ఎం అని ట్విట్ చేశారు అంటే..  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల. పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నాడు.'' అంటూ చంద్రబాబుపై, యనమలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

 

అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి గురించి అందరికి తెలిసిందే కదా సర్.. శవరాజకీయాలకు, వెన్నుపోటులకు ప్రత్యేకమైన స్థానం ఉంది చంద్రబాబుకు. అతని తర్వాత యనమల అంతటి వారే.. అందుకే ఇన్నేళ్లకు తుని ప్రజలు యనమల రామకృష్ణుడిని తరిమి కొట్టారు.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు కూడా. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: